Thursday, November 29, 2012

ఒకరాజు... ఏడుగురు కొడుకులు కథ...




అవథాని శ్రీ గరికపాటి నరసింహారావుగారు 2005లో అమెరికాలోని ఆంథ్రులకు శ్రీమద్రామాయణంలోని థర్మసూక్ష్మాలను వివరిస్తూ ఇచ్చిన ప్రసంగంలో "అనగనగా ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులు." అన్న కథలోని తత్వచింతనా కోణాన్ని అవిష్కరించారుఅది ఇక్కడ అందచేస్తున్నాను కథ ప్రతి తల్లి, తండ్రి చిన్నపిల్లలకు చెప్పే కథల్లో ముఖ్యమైనదిఅందరికి తెలిసినదేమామూలు కథగా ఆలోచిస్తే ఎదో పిచ్చి కథ అనిపిస్తుంది. ఇది కచ్చితంగా మన జీవితానికి ఎదో సందేశాన్ని ఇస్తుందిఅసలు రాజుగారి కొడుకులు వేటకు వెళ్ళి చేపలు తేవటమేమిటి..  అందులో ఒక చేపే ఎండక పోవటమేమిటికారణము గడ్డిమేటు అడ్డంరావటమేమి? అంటే కథలో ఎదో దోషమైనా ఉండాలి, లేదా అవగాహనైనా తేడా ఉండాలి కథలోని లోతైన తత్వాన్ని గమనిద్దాం

కథ:
అనగనగా ఒక రాజు రాజుకు ఏడుగురు కొడుకులుఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారుఏడు చేపలు తెచ్చారుఏడు చేపల్ని ఎండ పెట్టారుఅందులో ఒకచేప ఎండలేదుచేప చేప ఎందుకు ఎండలేదు. గడ్డిమేటు అడ్డమొచ్చింది. గడ్డిమేటా... గడ్డిమేటా ఎందుకు అడ్డమొచ్చావ్... ఆవు మెయ్యలేదు. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు... గొల్లవాడు మేపలేదు. గొల్లవాడా... గొల్లవాడా ఎందుకు మేపలేదు... అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా... అమ్మా ఎందుకు అన్నంపెట్టలేదు...  పిల్లవాడు ఏడిచాడుపిల్లవాడా... పిల్లవాడా ఎందుకు ఏడిచావు... చీమ కుట్టిందిచీమా చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టానా... అన్నది.

రాజుగారు అంటే మనిషిఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులువేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటముజీవితము అనే వేట.

ఏడు చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)).  ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.

వెలది, జూదంబు, పానంబు, వేట,పలుకు పల్లదనంబును, దండంబు బరుసదనము,
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ము సేత, యనెడు సప్త వ్యసనముల జనదు తగుల.

విదురుడు దృతరాష్టృనికి వ్యసనాల గురించి చెబుతూ చెప్పినదిప్రస్తుత సమాజములో కూడా సప్త వ్యసనాలు ఎలా మనిషిని పీడిస్తున్నాయో మనకి తెలియనిది కాదు.

ఎండపెట్టము అంటే వ్యసనాల్ని జయించుటసాథన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.

ఒకచేప ఎండలేదుఅంటే  సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినదికామాన్ని జయించటము చాలా కష్టముఅది ఎప్పటికి ఎండదుఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చునుమోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది అయిననూ అదికూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని.  కోరిక ఎండితే కానీ మోక్షము రాదుకోరిక లేక బంధము తోలగుటయే కదా మోక్షము

చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటుగడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీకమన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంతఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు.   ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుందిచెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారుసమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టముకనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చినారు.

గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటమువేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారుఇక్కడ ఆవు అనగా జ్ఞానముజ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగునుఆవులచే  మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది.  "జ్ఞానగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నదిజ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.

ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదుగొల్లవాడు అనగా సద్గురువుసద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థముసద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలిఅప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.  "కృష్ణం వందే జగద్గురుం".  జగద్గురువు శ్రీకృష్ణుడేఅతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది

గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదుఅమ్మ ఇచ్చిన అన్నం తిని, తీసుకొని వెళ్ళి ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యంఅంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థముజగన్మాత ఆజ్ఞలేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెనుఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థముదైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.

అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడుపిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటముఅటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుందిఅవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరుజగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాతఅంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము.

పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టిందిచీమ అంటే సంసారముసంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదుమనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమేసంసార, ఈతి భాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము

చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టిందినిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలేకానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్టచివరకు అనురక్తి తొలగి సంసార బాథలనుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును

కథ సారాంశము:
సప్తథాతువులతో కూడిన మనిషి సాథన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామముకు జయించుట కష్టముఅజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదుజ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగునుజ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడుఅట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడుసంసారమున చిక్కి బాథపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడుదైవముచేత పంపబడినవాడే సద్గురువుఅతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చునుకనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది